ఏసీబీకి చిక్కిన మారేడుపూడి విఆర్ఓ సూర్యనారాయణ.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:27
అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మారేడుపూడి విఆర్ఓ సూర్యనారాయణ లంచం తీసికుంటూ ఏసీబీకి చిక్కాడు. అక్కిరెడ్డిపాలెం పంచాయతీ ఇంచార్జ్ విఆర్ఓగా పనిచేస్తున్న ఎం.సూర్యనారాయణ అక్కిరెడ్డిపాలెం పంచాయతీలోని మూడున్నర ఎకరాల భూమికి సంబంధించి పాస పుస్తకాల జారీ కొరకు 30 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈరోజు 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు.
