ఘోర రోడ్డు ప్రమాదం.


 ఘోర రోడ్డు ప్రమాదం.

 లోయలో పడిన ఆటో* – ఇద్దరి పరిస్థితి విషమం.

 గొలుగొండ మండలం కొత్త జోగం పేట గ్రామంలో రోడ్డు ప్రమాదం.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి మార్చ్:08

నర్సీపట్నం–కేడీపేట రహదారిపై కొత్త జోగంపేట ఆలయం సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

 నర్సీపట్నం నుంచి కేడీపేట వైపు వెళ్తున్న ఆటో ముందుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయే ప్రయత్నంలో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయలో పడిపోయింది..

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

కాగా, ఆటో కొత్త మల్లంపేట ప్రాంతానికి చెందినదిగా ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post