స్థాయికి తగ్గ బోధనతో సత్ఫలితాలు.



స్థాయికి తగ్గ బోధనతో సత్ఫలితాలు.

( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
కంభం: ప్రకాశం జిల్లా కంభం మండలం కందులపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  3,4,5, తరగతి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించి టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ ద్వారా విద్యార్థులలో అంకగణిత నైపుణ్యాలు,ప్రాధమిక పఠన సామర్థ్యాలను పెంపొందించవచ్చని ఎంఈఓ-2 శ్రీనివాసులు అన్నారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ కార్యక్రమ నిర్వహణపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రాధమిక స్థాయి బోధన సవాళ్లతో కూడుకున్నదని,ప్రాథమిక దశలో విద్యార్థులను తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల నైపుణ్యాలకు కొలమానమంటూ, బి.సిహెచ్.రంగస్వామి, ఎం.వర ప్రసాద్  బోధన నైపుణ్యాలను ప్రశంసించారు.అనంతరం డొక్కా. సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post