అప్పులు బాధతో వ్యక్తి ఆత్మహత్య.
అనకాపల్లి మార్చి:17చోడవరం సీఐ అప్పలరాజు సమాచారం మేరకు సోమవారం తేదీ 16.03.2026న రాత్రి 11 గంటల సమయంలో చోడవరం గండికోలనీకి చెందిన గండి మహేశ్వరరావు. లేట్ దేముడు, 60 సం. లు అనే అసామీ బహిర్భూమికి అని ఇంటి నుండి బయటకు వెళ్లినట్లు, తరువాత మంగళవారం అనగా తేది 17.03.2026న ఉదయం సదరు గండి మహేశ్వరరావు చోడవరం పాత చెరువు నీటిలో చనిపోయి ఉండగా స్థానికులు చూసి, మృతుని భార్యకు తెలియజేసినట్లు, మృతుడు తనకు ఉన్న అప్పుల బాధలు భరించలేక నిన్న రాత్రి పాత చెరువులో దూకి చనిపోయినట్లుగా మృతుని భార్య అయిన గండి శైలజ ఇచ్చిన రిపోర్టుపై చోడవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. జోగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

