టీడీపీ నాయకుడి మాతృమూర్తిని పరామర్శించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.
*ఒంగోలు పట్టణం, సంఘమిత్ర వైద్యశాలలో కంభం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాసరావు మాతృమూర్తి వెంకటలక్ష్మి దేవి గారు ఆనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతుండగా, విషయం తెలుసుకున్న గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు వైద్యశాలకు వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..
