భార్యకు అధిక ఆదాయం ఉంటే భరణం ఇవ్వక్కర్లేదు: మద్రాస్ హైకోర్టు.



భార్యకు అధిక ఆదాయం ఉంటే భరణం ఇవ్వక్కర్లేదు: మద్రాస్ హైకోర్టు.

చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాసు హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. విచారణలో భార్యకు అధికంగా ఆస్తులు, ఆదాయం ఉన్నాయని తేలింది. దాంతో భార్యకు నెలకు రూ.30 వేలు భరణం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కుమారుడి చదువుకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదని వెల్లడించింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post