మద్యం మత్తు లో...కానిస్టేబుల్పై యువకుల దాడి..
తూర్పు గోదావరి జిల్లా :-
రాజమండ్రిలో కొందరు యువకులు రెచ్చిపోయారు.
ఓ పోలీసుపై దాడి చేశారు.
కోటిపల్లి బస్టాండ్ వెనుక కొందరు యువకులు బహిరంగంగా మద్యం ,గంజాయి సేవించడంతో కానిస్టేబుల్ నాగబాబు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
కానీ ఓ యువకుడు బీర్ బాటిల్తో తనను తాను కొట్టుకుని, అనంతరం కానిస్టేబుల్పై దాడి చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది.
ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.