పులివెందులలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీ.
క్రైమ్ 9 మీడియా త్రీలోకేష్ పులివెందుల రిపోర్టర్.
నవంబర్ 12.పులివెందుల.
మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు, ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పులివెందుల పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, విద్యార్థులు, వైద్యులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకతను తెలిపారు.


