చలో విజయవాడ గోడ పత్రికలు ఆవిష్కరణ.




చలో విజయవాడ గోడ పత్రికలు ఆవిష్కరణ. 

 

(ప్రకాశం జిల్లా క్రైమ్ నైన్ మీడియా ప్రతినిధి దాసరి యోబు) 

 ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని కందుల పురం సెంటర్  సమీపాన సి ఐ టి యు. మండల అధ్యక్షులు షేక్ అన్వర్. బొల్లవరపు రోశయ్య ఆధ్వర్యంలో. ఈ నెల 15న చలో విజయవాడ. రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడి సిద్ధం కావాలని గోడపత్రికలు అవిష్కరించారు. సిఐటియు మండల నాయకులు అన్వర్ మాట్లాడుతూ  కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలని అలాగే హెల్పర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు తక్షణమే పున ప్రారంభించాలని పెండింగ్ క్లెయిమ్స్ కు చెల్లించి. ప్రభుత్వం తీసుకున్న బోర్డు సొమ్మును తిరిగి చెల్లించాలని. అర్హులైన భవన నిర్మాణ కార్మికులందరికీ వృద్ధాప్య వితంతు. వికలాంగుల. పెన్షన్. పిల్లలకు స్కాలర్షిప్ లు.ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ మరియు రాడ్ బెండింగ్. వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బల్లావరపు రోశయ్య  యూనియన్ నాయకులు.ఏ శీను, జడ రాజు .ప్రభు.ఆంజనేయులు భీమా నాయక్. చెక్క సెంట్రింగ్ కార్మికులు. తాపీ మేస్త్రి కార్మికులు. మహిళ కార్మికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post