60 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు.





60 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు.

     పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పి4 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు  శ్రీ జీవి ఆంజనేయులు దంపతులు 60 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామాన్ని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, సతీమణి లీలావతి దంపతులు సందర్శించి గ్రామస్తులతో సమావేశమై 60 నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో నియోజకవర్గం నుండి  100 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరుగుతుందన్నారు. పేదరిక నిర్మూలన కోసం తమ కుటుంబ సభ్యులందరూ మార్గదర్శకులుగా ఉంటారని తెలిపారు. సంపన్నులందరు ముందుకొచ్చి  పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post