నక్కపల్లి పరిధిలో పేకాట శిబిరంపై దాడి: ఏడుగురు అరెస్ట్, నగదు స్వాధీనం.


 ​ నక్కపల్లి పరిధిలో పేకాట శిబిరంపై దాడి: ఏడుగురు అరెస్ట్, నగదు స్వాధీనం.

క్రైమ్ 9మీడియా జోనల్ ఇంచార్జి మహేశ్వరరావు.

 అనకాపల్లి (నక్కపల్లి)జనవరి 20 అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా  మరియు నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్పి పి.శ్రీనివాస రావు  ఆదేశాల మేరకు జిల్లాలో జూదానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా, నక్కపల్లి పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.

నక్కపల్లి ఎస్.హెచ్.ఓ మురళి  పర్యవేక్షణలో, మంగళవారం ఎస్.ఐ మల్లేశ్వరరావు మరియు వారి సిబ్బంది చందనాడ గ్రామ శివార్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

చందనాడ గ్రామ శివార్లలో కొంతమంది రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 9(1) గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, ఈ క్రింది చర్యలు తీసుకున్నారు:

​అరెస్టులు:పేకాట ఆడుతున్న ఏడుగురు (07) వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

​స్వాధీనం: వారి వద్ద నుండి రూ.30,200/- నగదు మరియు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

​ఈ సందర్భంగా ఎస్.హెచ్.ఓ మురళి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైన జూదం, పేకాట వంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి పనుల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ఆయన కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post