వైయస్సార్ సిపి ఆధ్వర్యంలో మూడోరోజు కు చేరిన రిలే నిరాహార దీక్ష.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలనే డిమాండ్తో గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ, శాసనసభ్యులు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కె. పి. నాగార్జున రెడ్డి మూడవ రోజు కొమరోలు మండలం కొమరోలు పట్టణం నందు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా కొనసాగింది.
రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో కొమరోలు జెడ్పీటీసీ సారె వెంకట నాయుడు ,బేస్తవారిపేట జెడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజయ్య ,ఎంపిపిలు వేగినాటి ఓసూరా రెడ్డి,మేడూరి వెంకట రావు ,రాష్ట్ర బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా కృష్ణ రెడ్డి ,రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి సూరా స్వామి రంగా రెడ్డి ,రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి నెమలిదీన్నే చెన్న రెడ్డి ,రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సంయుక్త కార్యదర్శి చేరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మండల కన్వీనర్లు మెరిగా రవి కుమార్ ,ఆవుల శ్రీధర్ రెడ్డి ,మానం బాలి రెడ్డి, నియోజకవర్గ ఎంప్లాయూస్ వింగ్ అధ్యక్షులు బంగారు విశ్వరూపం ,పంచాయత్ రాజ్ విభాగ అధ్యక్షులు మల్లెల చంద్రశేఖర రెడ్డి , సీనియార్ నాయకులు వెంగయ్య చౌదరి చెదుల్లా రమణ రెడ్డి,సారె జనార్ధన్ నాయుడు , ఎంపీటీసీలు,సోషల్ మీడియ,యువజన విధ్యార్తి విభాగ అధ్యక్షులు మరియు నాయకులు,కార్యకర్తలు అభిమానులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
