భర్తకు తలకొరివి పెట్టిన భార్య.. పలాసలో భావోద్వేగ ఘటన.



 భర్తకు తలకొరివి పెట్టిన భార్య.. పలాసలో భావోద్వేగ ఘటన.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 29 : శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని జగన్ అన్నా కాలనీలో సోమవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన నెయ్యిల ఉమా మహేశ్వరరావు (56) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.

సోమవారం నిర్వహించిన అంత్యక్రియలకు బంధుమిత్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ఉమా మహేశ్వరరావుకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన భార్య నెయ్యిల సరస్వతి, హిందూ సంప్రదాయాల ప్రకారం భర్తకు తలకొరివి పెట్టి చివరి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. జీవితాంతం తనకు తోడుగా నిలిచిన భర్తకు చివరి వీడ్కోలు పలుకుతూ ఆమె కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

స్థానికుల కథనం ప్రకారం ఉమా మహేశ్వరరావు సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తిగా, అందరితో ఆప్యాయంగా మెలిగే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన మృతితో జగన్ అన్నా కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, స్నేహితులు, బంధువులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భార్య సరస్వతి భర్తకు తలకొరివి పెట్టిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జీవిత భాగస్వామికి చివరి వీడ్కోలు పలుకుతూ ఆమె చూపిన ధైర్యం, ఆవేదన అక్కడున్న వారిని తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post