గన్నవరం . క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శరత్.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన “ఏక్ పెడ్ మా నామ్” కార్యక్రమంలో భాగంగా భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు & ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికిపాటి శివ శంకర్ హనుమాన్ జంక్షన్ ఇందిరనగర్ లో మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తల్లిదండ్రుల పేరు మీద ఒక మొక్క నాటడం ద్వారా ప్రకృతికి కృతజ్ఞత చాటుకోవాలని ఈ సందర్భంగా గరికిపాటి శివశంకర్ పిలుపునిచ్చారు. "ఏక్ పెడ్ మా నామ్" కార్యక్రమం ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు ఉపయోగపడుతుందని, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరట.. మనల్ని బతికిస్తున్న నేలతల్లి సాక్షిగా మొక్కలు నాటుదాం అని ఆయన అన్నారు.
