బేస్తవారిపేట పట్టణంలో వైసీపీ పార్టీ ముఖ్య కార్యకర్తలను ఆత్మీయ పలకరింపు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట టౌన్ వైసిపి పార్టీ టౌన్ అధ్యక్షుడు మిట్ట చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజున రాణి పేట ఎస్సీ కాలనీకి వైసిపి పార్టీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు
ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షుడు మిట్ట చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత నెల నుండి ప్రతి రోజు టౌన్ లో ప్రతి బజారులో ముఖ్య నాయకులను కలవటంతొ పాటు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలంటూ ప్రజలకు దగ్గరవుతూ పార్టీ ని బలపేతం చేయటం జరుగుతుంది. నాకు సహకరిస్తున్న పార్టీ నాయకులు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ . రానున్న రోజుల్లో పార్టీ కోసం 24/7 గంటలు పని చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట వైసిపి యసి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
