ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కార్యదర్శి టీడీపీ నేతలు. .
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్లాన్ క్యాంపెయిన్లో భాగంగా గ్రామసభ నిర్వహించారు. నూతనంగా గ్రేడ్-2 కార్యదర్శిగా పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించిన మానుకొండ రమణయ్య ఆధ్వర్యంలో* జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
గ్రామసభ వివరాలు కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్కీ యోజన సబ్కా వికాస్.కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు గ్రామ పంచాయతీ కార్యదర్శి మానుకొండ రమణయ్య అధ్యక్షత వహించారు.
పర్యావరణ దినోత్సవం -మొక్కలు నాటే కార్యక్రమం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యదర్శి మానుకొండ రమణయ్య గారి ఆధ్వర్యంలో గ్రామ సిబ్బంది, బేస్తవారిపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా రమణయ్య పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు.
గ్రామంలోని సమస్యలు, అవసరాలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. పారదర్శక పాలన, అవినీతి రహిత సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రేడ్-2 కార్యదర్శిగా పదోన్నతి రావడంతో బాధ్యత మరింత పెరిగిందని, ప్రజల కు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు.
ఈ గ్రామసభలో బేస్తవారిపేట మండల టీడీపీ నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం వంటి పలు అంశాలపై సభలో చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేలా చర్యలు తీసుకుంటామని కార్యదర్శి తెలిపారు.
పచ్చదనం - పరిశుభ్రతే లక్ష్యం ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మొక్కలు నాటడం ద్వారా గ్రామసభకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
నూతన కార్యదర్శి రమణయ్య ఆధ్వర్యంలో బేస్తవారిపేట మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
.jpeg)
