జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లాకు అరుదైన గౌరవం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు
గుండమాల గ్రామపంచాయతీకి ‘స్వయం సమృద్ధి పంచాయతీ’ అవార్డు పంట.తృతీయ బహుమతి సాధించిన గుండమాల పంచాయతీ రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేత
న్యూఢిల్లీలో ఘనంగా జరిగిన జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల ప్రధానోత్సవంలో, *కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రదానం చేయబడింది.
అవార్డును ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి శ్రీ ఎం. వెంకటేశ్వరరావు మరియు గుండాయపాలెం పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీమతి లావణ్యస్వీకరించారు.
మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, ప్రజా భాగస్వామ్యం మరియు స్వయం సమృద్ధి సాధనలో చూపిన విశిష్ట పనితీరు కారణంగా ఈ జాతీయ గుర్తింపు లభించింది.
ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ ప్రజల సమిష్టి కృషి ఫలితంగానే ఈ ఘనత సాధ్యమైందని జిల్లా అధికారులు పేర్కొన్నారు.
ఈ అవార్డు ద్వారా ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించగా, జిల్లాలోని ఇతర గ్రామపంచాయతీలకు స్ఫూర్తిగా నిలిచింది
గుండమాల గ్రామపంచాయతీకి, గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు హృదయపూర్వక అభినందనలు!

