బీరు గురించి వడ్రంగి కత్తితో దాడి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీనివాస్.
విజయవాడ, జూన్ 22,
విజయవాడ లోని కృష్ణ లంక ఏరియా లో శిశు భవన్ దగ్గర కరకట్ట పై తండ్రి కొడుకులపై కుమార్ అనే వ్యక్తి వడ్రంగి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయగా... కర్రి భాను (47),మరియు కర్రి రాంచరణ్ (17)లకు మెడ పై తీవ్రంగా గాయాలు అయ్యాయి... గాయ పడిన వారిని స్థానికులు ముందుగా కృష్ణ లంకలో గల శ్రీరామ హాస్పిటల్ కి తీసుకువెళ్లడం జరిగింది.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్రి భాను ని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు, రాంచరణ్ ని మణిపాల్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.. తండ్రి కొడుకులు ఇద్దరు కోమాలో ఉన్నారనేది సమాచారం. బీరు (మద్యం ) కోసం జరిగిన (గొడవ )సంఘటనగా స్థానికుల సమాచారం... పూర్తి వివరాలు తెలియ వలసి ఉంది..

