మహిళల గౌరవాన్ని కించపరిస్తే ఉపేక్షించిదే లేదు - ఎమ్మెల్యే గౌతు శిరీష.


 మహిళల గౌరవాన్ని కించపరిస్తే ఉపేక్షించిదే లేదు - ఎమ్మెల్యే గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 16: 

మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు మరింత బలంగా ఉండాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ హోం మంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మహిళా నాయకులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం అత్యంత బాధాకరమని, ఇటువంటి సంస్కృతి రాజకీయాల్లో ఉండకూడదన్నారు.

"అమర్ నాథ్ గారు మీ ఇంట్లో మహిళలు లేరా? మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలి" అని ఎమ్మెల్యే శిరీష డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల భద్రత, గౌరవ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు మరింత రక్షణ కల్పించేలా కఠిన చట్టాలను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post