పేకాట ఆడుతున్న వారిపై పోలీసుల మెరుపు దాడి: ఏడుగురు అరెస్ట్, రూ.10,150 నగదు స్వాధీనం.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి కోటవురట్ల, జూన్:24
అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా మరియు నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావుల ఆదేశాల మేరకు, నక్కపల్లి సి.ఐ రామకృష్ణ పర్యవేక్షణలో కోటవురట్ల పోలీసులు మండలంలో పేకాట రాయుళ్లపై ఉక్కుపాదం మోపారు.
కోటవురట్ల ఎస్సై విజయ్ కుమార్ మరియు వారి సిబ్బంది మంగళవారం అర్ధరాత్రి మండల పరిధిలోని ఆర్.సి.పురం గ్రామ శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై ఆకస్మిక మెరుపు దాడి నిర్వహించారు.
అరెస్ట్ అయిన వారు: పేకాట ఆడుతున్న ఏడుగురు (7) వ్యక్తులను పోలీసులు రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుల వద్ద నుండి
రూ.10,150/- నగదుతో పాటు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై కోటవురట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.
మండల పరిధిలో ఎక్కడైనా జూదం, పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి పనుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
