కంభం లో ఉదయగిరి బృందావన్ గార్డెన్ వారి ఆధ్వర్యంలోఉచిత వైద్య శిబిరం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలో ఉదయగిరి బృందావనం కళ్యాణ మండపం వారి ఆధ్వర్యంలో శాంతి రామ్ కంటి వైద్యశాల కర్నూల్ వారిచే ఉచిత కంటి గుండె ఆపరేషన్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి దాదాపు 200 మంది ఉచితంగా కంటి గుండె సంబంధించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చేయించుకున్న వారు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి ఈసీజీ కంటి మరియు గుండె ఆపరేషన్కు ఎంపికైన వారిని క్యాంపు రోజే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అలాగే కంటి మరియు గుండె ఆపరేషన్ కు ఎంపికైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని రానుపోను ఉచిత బస్సు భోజనం వసతి కంటి ఆపరేషన్ చేయబడుతాయని ఉదయగిరి బృందావనం కల్యాణ మండపం ప్రోపరేటర్. మరియు. న్యాయవాది ఉదయగిరి మల్లికార్జున రావు తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో శాంతిరాం కంటి వైద్యశాల కర్నూల్ వారిచే మృదుల మోహన్ వైద్యశాల బృందం. డాక్టర్,, మృదుల నాయుడు.
డాక్టర్,, యామ మోహన సాయి కృష్ణ. పాల్గొని ఉచిత వైద్య శిబిరంలో సేవలందించారు. ఈ కార్యక్రమానికి పలువురు జనసేన నాయకులు నారాయణ. తాడిశెట్టి ప్రసాద్. సంకతాల వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు.

