నేడు గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం..ముత్తుముల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ప్రజల నుండి వచ్చే అర్జీలను స్వయంగా స్వీకరించనున్న గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి
ఈరోజు అనగా శనివారం ఉదయం 9.00 లకు గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజల వినతులను స్వీకరిస్తారు.
కావున గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను శాసనసభ్యులు గారికి స్వయంగా వచ్చి తెలియజేయవచ్చు అన్నారు
