శ్రీశైలం శివభక్తుల కు వైద్య శిభిరం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా
మహా శివరాత్రి సందర్బంగా దోర్నాల పట్టణము లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఏలూరి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు, భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు డి ఎస్ పి నాగరాజు ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరి అశోక్ రెడ్డి,మాజీ జిల్లా ఇంచార్జి రవి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు నరాల శ్రీనివాస రెడ్డి, గిద్దలూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్,మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి.వెంకటరామాంజనేయులు, జిల్లా బీజేపీ ఆర్ టి ఐ నరసింహ రావు, జిల్లా ఉపాధ్యక్షులు పిచ్చయ్య, కంబం మండల బీజేపీ అధ్యక్షులు బాదం కిషోర్ పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు మాట్లాడుతూ భక్తులకు వైద్య శిభిరం నిర్వహించి వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం శుభపరిణామముఅన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని అన్నారు.
