ఘనంగా మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య జయంతి వేడుకలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవ య్య జీవితాన్ని స్ఫూర్తిగాతీసుకోవాల ని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ప్రజలకుపిలుపు నిచ్చారు.
శనివారం దామోదర సంజీవ య్య 105వజయంతి సందర్భంగా కలెక్టరేట్ ఎదురు ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.రాజబాబు, ఒంగోలుపార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత పూల మాలవేసి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దామోదర సంజీవయ్య.ఆంధ్రప్రదే శ్ తొలి ముఖ్యమంత్రి గాపని చేశారని అన్నారు.
దామోదర సంజీవయ్య బాల్యం నుండి అనేక కష్టాలు పడి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. దామోదర సంజీవ య్య చదువు ద్వారానే ఏదైనా సాధించవచ్చునని గ్రహించి చిన్నతనం నుండి సామాన్య జీవితంగడిపి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు.
ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి,రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్.రియాజ్, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేషు,
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పు వరపు సుచిత్ర, జిల్లా సాంఘి కసంక్షేమశాఖ అధికారి లక్ష్మణ నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వ రరావు దళిత సంఘాల ప్రతినిధులు. నీలం నాగేంద్ర, యాదాల అరుణ్ కుమార్.తదితరులు పాల్గొన్నారు.

