సీఎం రిలీఫ్ ఫండ్ 75 వేల రూ "' సహాయనిది అందించిన కూటమి నాయకులు..
అనకాపల్లి ఫిబ్రవరి:06
మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కే.జె పురం గ్రామానికి చెందిన బొడ్డేడి వేంకటేష్ ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 75వేల రూపాయిలు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చేతి మీదగా చెక్కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాడుగుల మండల క్లస్టర్ ఇంచార్జ్ భీశేట్టి విజయలక్ష్మి టిడిపి సీనియర్ నాయకులు పాలకుర్తి శ్రీనివాసరావు కాళ్ళ నర్సింగ్ రాజు మరియు యూనిట్ ఇన్చార్జి మద్దాల ప్రసాద్ బూత్ కన్వీనర్ యల్లపు రాము, సూరిశెట్టి వెంకటా అప్పారావు జనసేన నాయకులు కాళ్ళ అనీలు మరియు కూటమి నాయకులు పాల్గొనడం జరిగినది. ఈ సందర్బంగా గ్రామస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసారు.
