పింఛన్ డబ్బుల కోసం స్నేహితుడి అతికిరాతకముగా హత్య చేసిన వ్యక్తి అరెస్ట్.


 పింఛన్ డబ్బుల కోసం స్నేహితుడి అతికిరాతకముగా హత్య చేసిన వ్యక్తి అరెస్ట్. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం లో సంచలనం సృష్టించిన హత్య కేసును ఎస్పీ ఆదేశాల మేరకు డి.ఎస్.పి యు నాగరాజు ఆధ్వర్యంలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున బేస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి ఎంతో చాకచక్యంతో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది.

 డి.ఎస్.పి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం బెస్తవారిపేట మండలంలోని బీసీ కాలనీ నందు దూదేకుల కులానికి చెందిన నాగూర్ ఇంటిని అద్దెకు తీసుకొని గత కొంతకాలంగా పొట్టేలు మాంసమును బెస్తవారిపేటలో విక్రయిస్తున్న మోక్షగుండం కొమరోలు చిన రంగయ్య మరియు జయంపు కృష్ణ అను ఇద్దరూ గత కొంతకాలంగా ఒకే చోట ఉంటూ వ్యాపారం సాగిస్తున్నారు. గత 31 వ తారీఖున జయంబు కృష్ణయ్యకు పింఛన్ రావడం తో వచ్చిన 4000 రూపాయలు పింఛన్లు ఇంట్లో సరుకుల కోసం ఇమ్మని అడుగులుగా దాని విషయమై ఇరువురి మధ్య కొంత గొడవ జరిగింది. సదరు రంగయ్య ఆవేశంతో నిద్రిస్తున్న జయంపు కృష్ణయ్యను మాంసం కోసే కత్తితో గొంతు పై మరియు రెండు చేతి మనికట్లను నరకడంతో మృతుడు జయంబు కృష్ణయ్య అక్కడికక్కడే మరణించడం జరిగింది.

ఈ విషయమై భయపడిన కొమరోలు రంగయ్య ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మరియు డి.ఎస్.పి నాగరాజు ఈ కేసును ఎంతో వ్యక్తిగతంగా తీసుకొని సదరు సిఐ మల్లికార్జున బెస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి తో కలిసి ఈ కేసును చాకచక్యముతో వ్యవహరించి ముద్దాయిని అరెస్టు చేయటం జరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు.

Post a Comment

Previous Post Next Post