ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్.


 ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్.


▪️కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో 28కి పెరిగిన జిల్లాలు. రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు రేపటినుంచి అమలు.

▪️మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌.

▪️రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు.

▪️మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు.

▪️కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌.

▪️నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్‌ నుంచి టెక్కలికి మార్పు.

▪️సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్‌ నుంచి పెద్దపురానికి మార్పు.

▪️పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్‌ చేస్తూ ఉత్తర్వులు.

▪️పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మారుస్తూ తుది నోటిఫికేషన్‌.

▪️అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు.

▪️అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చుతూ ఉత్తర్వులు.

Post a Comment

Previous Post Next Post