కారుణ్య కోటాలో ఉద్యోగుల నియామకం.

కారుణ్య కోటాలో ఉద్యోగుల నియామకం. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం ఒంగోలు ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు చెప్పారు.

 కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగాలు 

పొందిన 8 మందికి, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పరిహారంలో భాగంగా ఉద్యోగాలు పొందిన ఇద్దరికి సోమవారం గ్రీవెన్స్ హాలులో ఆయన నియామక పత్రాలు అందించారు. 

ప్రభుత్వ సర్వీసులోకి వస్తున్నందుకు అభినందిస్తూ, విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post