“అభ్యుదయ సైకిల్ యాత్ర – Pedal for a Drug-Free Future”.


“అభ్యుదయ సైకిల్ యాత్ర – Pedal for a Drug-Free Future”.

నర్సీపట్నం టౌన్ నుండి రోలుగుంట వరకు విశేష స్పందన.

కుటుంబం & సమాజంపై మాదకద్రవ్యాల ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన.

అనకాపల్లి(నర్సీపట్నం):15నవంబర్ 

విశాఖపట్నం రేంజ్ పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలనకు, యువతలో అవగాహన పెంపునకు చేపట్టిన “అభ్యుదయ సైకిల్ యాత్ర” నర్సీపట్నం టౌన్‌లో అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమై రోలుగుంట పీఎస్ హద్దులవరకు అపార స్పందనను పొందింది.

నర్సీపట్నం టౌన్‌లో కార్యక్రమం ప్రారంభం

ఉదయం 10.00 గంటలకు నర్సీపట్నం అబిడ్స్ సెంటర్ వద్ద ఓపెన్ స్టేజ్ కార్యక్రమంతో యాత్ర ప్రారంభమైంది. కార్యక్రమానికి అదనపు ఎస్పీ శ్రీ ఎం.దేవ ప్రసాద్, డీఎస్పీ పి.శ్రీనివాసరావు,  చింతాలయల విజయ్ (TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), మునిసిపల్ కమిషనర్,ఎంఆర్ఓ, టౌన్ సీఐ గోవిందరావు, రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్సైలు ఉమామహేశ్వరరావు, రాజారావు, పోలీస్ సిబ్బంది, ఇంకా వివిధ స్కూళ్లు–కాలేజీలకు చెందిన దాదాపు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

కళాశాల విద్యార్థులు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై చిన్న నాటిక ప్రదర్శించడం, ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డ్రగ్ బాధిత కుటుంబాల హృదయ విదారక వాక్యాలు

మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలను ఏ విధంగా ఛిన్నాభిన్నం చేస్తుందో వివరించేందుకు బాధితుల కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు:

 1. రవణపు ఆనంద్ కుమార్  అన్నయ్య డ్రగ్స్ కారణంగా మరణించిన ఘటన.

 2. నులు ప్రసన్న కుమార్ గారి కుమారుడు డ్రగ్స్‌కు బానిసై మానసిక రుగ్మతకు లోనై జీవితం దెబ్బతిన్న విషయం.

ఈ సంఘటనలు అక్కడి ప్రజలను మానసికంగా కదిలించాయి.

అధికారులు ప్రజలకు మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించి అందరికీ యాంటీ-డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు.

తరువాత ర్యాలీ చెట్టిపల్లి–నర్సీపట్నం రూరల్ ప్రాంతాల గుండా భారీగా కొనసాగింది.

సైకిల్ ర్యాలీ రోలుగుంట పిఎస్ పరిధిలోకి ప్రవేశం

కొత్తకోట సర్కిల్–రోలుగుంట పిఎస్ పరిధిలోకి ర్యాలీ ప్రవేశించినప్పుడు

కొత్తకోట సీఐ శ్రీ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్సై పి.రామకృష్ణరావు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.

దాదాపు 200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొని ర్యాలీకి ఐక్యంగా మద్దతు తెలిపారు.

విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలు వివరించడం

ప్రజలకు యాంటీ-డ్రగ్ ప్రతిజ్ఞ చేయించడం

డ్రగ్ అవగాహనా పాంప్లెట్లు పంపిణీ చేయడం

వంటి కార్యక్రమాలు జరిగాయి.

కుటుంబం & సమాజంపై మాదకద్రవ్యాల ప్రభావం — అభ్యుదయ సైకిల్ యాత్ర ప్రధాన సందేశం

మాదకద్రవ్యాల వినియోగం ఒక నేరం మాత్రమే కాదు —

కుటుంబాలను నిశ్శబ్దంగా నాశనం చేసే సామాజిక వ్యాధి.

డ్రగ్స్ బారిన పడితే ఒక్కరే కాదు, మొత్తం కుటుంబం బాధపడుతుంది.

ఇంటిలో ప్రేమ, నమ్మకం తగ్గిపోతాయి; ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.

అలవాటు కోసం దొంగతనం వంటి నేరాలకు వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి.

సమాజంపై ప్రభావం మరింత విస్తృతం:

డ్రగ్స్ ఉన్న ప్రాంతాల్లో నేరాలు పెరుగుతాయి.

విద్యార్థులు చదువు వదిలిపెట్టే ప్రమాదం పెరుగుతుంది.

దేశ భవిష్యత్తు అయిన యువతే బలహీనపడతారు.

మత్తుపదార్థాల అక్రమ వ్యాపారం భయం, అనిశ్చితి పెంచుతుంది.

పోలీసు శాఖ ఈ ప్రమాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే మహత్తర లక్ష్యంతో పనిచేస్తున్నప్పటికీ—

కుటుంబాలు, విద్యాసంస్థలు, సమాజం కలిసి పనిచేసినప్పుడే పూర్తి విజయం సాధ్యం.

తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలి, తొలి సంకేతాలను గమనించాలి.

పాఠశాలలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

సమాజం అపహాస్యం చేయకుండా పునరావాసానికి మద్దతు ఇవ్వాలి.

డీఐజి వారు సందేశం

“మాదకద్రవ్యాల నివారణ అనేది కేవలం పోలీసుల బాధ్యత కాదు;

ప్రతి పౌరుడి, ప్రతి తల్లిదండ్రుల సామాజిక బాధ్యత.”

డ్రగ్స్ ఒక వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును ధ్వంసం చేస్తాయని చెప్పారు.

కుటుంబాల్లో ప్రేమ, పర్యవేక్షణ, బహిరంగ చర్చలు మాదకద్రవ్యాల నిరోధానికి కీలకమని పేర్కొన్నారు.

“డ్రగ్స్ రహిత భవిష్యత్తు కోసం ప్రజలందరూ కట్టుబడి చేయాలని కోరుతున్నారు.”

విశాఖపట్నం రేంజ్ డీఐజీ  గోపీనాథ్ జట్టీ, ఐపీఎస్ ,

అనకాపల్లి జిల్లా ఎస్పీ  తుహిన్ సిన్హా, ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న  విద్యార్థులు, ఉపాధ్యాయులు,

ప్రజలు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని సమాజ నిర్మాణం కోసం ముందున్నారనే అభినందనలు తెలిపారు.

రేంజ్ పోలీసుల ఆధ్వర్యంలో “అభ్యుదయ సైకిల్ యాత్ర” ప్రజల్లో విశేష స్పందనతో కొనసాగుతోంది.

 *“అభ్యుదయ సైకిల్ యాత్ర – Pedal for a Drug-Free Future”.

నర్సీపట్నం టౌన్ నుండి రోలుగుంట వరకు విశేష స్పందన.

కుటుంబం & సమాజంపై మాదకద్రవ్యాల ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన. 

అనకాపల్లి(నర్సీపట్నం):15నవంబర్ 

విశాఖపట్నం రేంజ్ పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలనకు, యువతలో అవగాహన పెంపునకు చేపట్టిన “అభ్యుదయ సైకిల్ యాత్ర” నర్సీపట్నం టౌన్‌లో అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమై రోలుగుంట పీఎస్ హద్దులవరకు అపార స్పందనను పొందింది.

నర్సీపట్నం టౌన్‌లో కార్యక్రమం ప్రారంభం

ఉదయం 10.00 గంటలకు నర్సీపట్నం అబిడ్స్ సెంటర్ వద్ద ఓపెన్ స్టేజ్ కార్యక్రమంతో యాత్ర ప్రారంభమైంది. కార్యక్రమానికి అదనపు ఎస్పీ శ్రీ ఎం.దేవ ప్రసాద్, డీఎస్పీ పి.శ్రీనివాసరావు, చింతాలయల విజయ్ (TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), మునిసిపల్ కమిషనర్,ఎంఆర్ఓ, టౌన్ సీఐ గోవిందరావు, రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్సైలు ఉమామహేశ్వరరావు, రాజారావు, పోలీస్ సిబ్బంది, ఇంకా వివిధ స్కూళ్లు–కాలేజీలకు చెందిన దాదాపు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

కళాశాల విద్యార్థులు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై చిన్న నాటిక ప్రదర్శించడం, ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డ్రగ్ బాధిత కుటుంబాల హృదయ విదారక వాక్యాలు

మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలను ఏ విధంగా ఛిన్నాభిన్నం చేస్తుందో వివరించేందుకు బాధితుల కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు:

 1. రవణపు ఆనంద్ కుమార్ అన్నయ్య డ్రగ్స్ కారణంగా మరణించిన ఘటన.

 2. నులు ప్రసన్న కుమార్ గారి కుమారుడు డ్రగ్స్‌కు బానిసై మానసిక రుగ్మతకు లోనై జీవితం దెబ్బతిన్న విషయం.

ఈ సంఘటనలు అక్కడి ప్రజలను మానసికంగా కదిలించాయి.

అధికారులు ప్రజలకు మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించి అందరికీ యాంటీ-డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు.

తరువాత ర్యాలీ చెట్టిపల్లి–నర్సీపట్నం రూరల్ ప్రాంతాల గుండా భారీగా కొనసాగింది.

సైకిల్ ర్యాలీ రోలుగుంట పిఎస్ పరిధిలోకి ప్రవేశం

కొత్తకోట సర్కిల్–రోలుగుంట పిఎస్ పరిధిలోకి ర్యాలీ ప్రవేశించినప్పుడు

కొత్తకోట సీఐ శ్రీ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్సై పి.రామకృష్ణరావు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.

దాదాపు 200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొని ర్యాలీకి ఐక్యంగా మద్దతు తెలిపారు.

విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలు వివరించడం

ప్రజలకు యాంటీ-డ్రగ్ ప్రతిజ్ఞ చేయించడం

డ్రగ్ అవగాహనా పాంప్లెట్లు పంపిణీ చేయడం

వంటి కార్యక్రమాలు జరిగాయి.

కుటుంబం & సమాజంపై మాదకద్రవ్యాల ప్రభావం — అభ్యుదయ సైకిల్ యాత్ర ప్రధాన సందేశం

మాదకద్రవ్యాల వినియోగం ఒక నేరం మాత్రమే కాదు —

కుటుంబాలను నిశ్శబ్దంగా నాశనం చేసే సామాజిక వ్యాధి.

డ్రగ్స్ బారిన పడితే ఒక్కరే కాదు, మొత్తం కుటుంబం బాధపడుతుంది.

ఇంటిలో ప్రేమ, నమ్మకం తగ్గిపోతాయి; ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.

అలవాటు కోసం దొంగతనం వంటి నేరాలకు వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి.

సమాజంపై ప్రభావం మరింత విస్తృతం:

డ్రగ్స్ ఉన్న ప్రాంతాల్లో నేరాలు పెరుగుతాయి.

విద్యార్థులు చదువు వదిలిపెట్టే ప్రమాదం పెరుగుతుంది.

దేశ భవిష్యత్తు అయిన యువతే బలహీనపడతారు.

మత్తుపదార్థాల అక్రమ వ్యాపారం భయం, అనిశ్చితి పెంచుతుంది.

పోలీసు శాఖ ఈ ప్రమాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే మహత్తర లక్ష్యంతో పనిచేస్తున్నప్పటికీ—

కుటుంబాలు, విద్యాసంస్థలు, సమాజం కలిసి పనిచేసినప్పుడే పూర్తి విజయం సాధ్యం.

తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలి, తొలి సంకేతాలను గమనించాలి.

పాఠశాలలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

సమాజం అపహాస్యం చేయకుండా పునరావాసానికి మద్దతు ఇవ్వాలి.

డీఐజి వారు సందేశం

“మాదకద్రవ్యాల నివారణ అనేది కేవలం పోలీసుల బాధ్యత కాదు;

ప్రతి పౌరుడి, ప్రతి తల్లిదండ్రుల సామాజిక బాధ్యత.”

డ్రగ్స్ ఒక వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును ధ్వంసం చేస్తాయని చెప్పారు.

కుటుంబాల్లో ప్రేమ, పర్యవేక్షణ, బహిరంగ చర్చలు మాదకద్రవ్యాల నిరోధానికి కీలకమని పేర్కొన్నారు.

“డ్రగ్స్ రహిత భవిష్యత్తు కోసం ప్రజలందరూ కట్టుబడి చేయాలని కోరుతున్నారు.”

విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ, ఐపీఎస్ ,

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు,

ప్రజలు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని సమాజ నిర్మాణం కోసం ముందున్నారనే అభినందనలు తెలిపారు.

రేంజ్ పోలీసుల ఆధ్వర్యంలో “అభ్యుదయ సైకిల్ యాత్ర” ప్రజల్లో విశేష స్పందనతో కొనసాగుతోంది.

Post a Comment

Previous Post Next Post