పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులు విడుదల సందర్భంగా రైతులు భారీ టాక్టర్ల ర్యాలీ.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి.
ప్రకాశం మర్రిపూడిలో ర్యాలీలో పాల్గొన్న మంత్రి డీఎస్ బీవీ స్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య.
ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ నడిపిన మంత్రి స్వామి, దామచర్ల సత్య.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ద్వేయం.
అన్నదాత సుఖీభవ కింద 46.86 లక్షల మంది రైతులకు రెండు విడతల్లో రూ. 6,310 కోట్ల లబ్ది.
చెప్పిన మాట ప్రకారం ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద అన్నదాతకు రూ. 20 వేల ఆర్థిక సాయం.
నాడు జగన్ రైతు భరోసా రూ.13,500 ఇస్తానని చెప్పి కేవలం రూ. 7 వేలు ఇచ్చి రైతుల్ని మోసం చేశారు.
విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటున్నాం.
అన్నదాతల కుటుంబాల్లో ఆనందమే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదం అన్నారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
