పేకాట స్థావరంపై దాడి నలుగురు అరెస్ట్.ఎస్.ఐ.బి నరసింహారావు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
నలుగురు అరెస్ట్, రూ. 5320/- స్వాధీనం.
కంభం: ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరం గ్రామంలోని పేకాట స్థావరంపై ఆదివారం కంభం ఎస్ఐ బి.నరసింహారావు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 5320 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్ఐ బి.నరసింహారావు మాట్లాడుతూ పేకాట అడటం చట్టరీత్యా నేరమని, ఎవరైనా అలాంటి కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే సమాచారం అందించాలని, అట్లు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Add

