రంగాపురం మరియు వెలగలపాయ గ్రామాలలో పిలుస్తుంది కార్యక్రమం.

 



రంగాపురం మరియు వెలగలపాయ గ్రామాలలో పిలుస్తుంది కార్యక్రమం.


(.ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.)

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని రంగాపురం మరియు వెలగలపాయ గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మండల వ్యవసాయ అధికారి జి శివగంగ ప్రసాద్ మాట్లాడుతూ NPCI account చేయించుకోవాల్సిన రైతుల వివరాలను తెలియ చేయడం జరిగింది. రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పక చేయించుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ఈనెల చివరిలోగా రైతులందరూ చేసినటువంటి పంటలకు ఈ క్రాఫ్ బుకింగ్ చేయించుకోవాలని తెలియజేశారు. నానో యూరియా మరియు నానో డి ఏ పి వలన కలిగే ఉపయోగాలు రైతులకు వివరించడం జరిగింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా రైతులు వ్యవసాయంలో మార్పులు తేవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగిరెడ్డి మరియు వీఐలు వెంకటేశ్వర్లు మరియు బాలీశ్వరయ్య గ్రామ రైతులు పాల్గొన్నారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post