*క్షయ వ్యాధి పైన అవగాహన కార్యక్రమం*
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 ప్రతినిధి దాసరి యోబు.)
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని డా.బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో టీబి ముక్త్ భారత్* *అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. టీబి వ్యాధి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అని వాటి లక్షణాలు ఒకటి.రెండు వారాలకు మించి దగ్గు. రెండు వారాలకు మించి జ్వరం. మూడు వారాలకు బరువు తగ్గిపోవటం నాలుగు వారాలకు కళ్ళే రక్తం పడటం. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు కళ్ళే పరీక్ష చేపించుకోవాలి అని అలాగే ఈ వ్యాధి నిర్ధారణ ఐన వాళ్ళకి మందులు పూర్తి ఉచితం అని టీబి.సూపర్వైజర్ ఎ.బాబు తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి అని తెలియజేశారు .కార్యక్రమంలో భాగం గా టీబీహేవి శ్రీనివాస్ రెడ్డి, సి హెచ్ వో ప్రవల్లిక మిగతా సిబ్బంది పాల్గొన్నారు.
