ఐదేళ్లుగా పరారీలో ఉన్న గంజాయి కేసు ప్రధాన నిందితుడి అరెస్ట్.
సామర్లకోటలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న రోలుగుంట పోలీసులు.
రెండు పెండింగ్ NBWలు, మరొక కేసులో ప్రమేయం గుర్తింపు.
కేసు చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులకు ఎస్పీ తుహిన్ సిన్హా అభినందనలు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జులై:27
రోలుగుంట గత ఐదేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న గంజాయి కేసు ప్రధాన నిందితుడిని రోలుగుంట పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఉత్తర్వుల మేరకు, సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో, 2022 మే నెలలో మారుతి కారులో 60 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడైన (A1) రత్నంపేటకు చెందిన అర్లి గణేష్ పరారీలో ఉన్నాడు. అప్పట్లో ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా, గణేష్ మాత్రం తప్పించుకున్నాడు.
ప్రత్యేక బృందాల విచారణలో నిందితుడు సామర్లకోటలో నివాసముంటున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో, వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
విరుపై పాత కేసులు
అరెస్టయిన అర్లి గణేష్పై గతంలో నమోదైన రెండు గంజాయి కేసులలో నాన్-బెయిలబుల్ వారెంట్లు (ఎన్ బి డబల్యు) పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఐదేళ్లుగా లభించని నిందితుడి ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్ఐ రామకృష్ణారావు మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు.
