కంభం లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా గోళ్ళ సుబ్బరత్నం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం 2026 - 27 లయనిస్టిక్ సంవత్సరానికి, కంభం లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా, వాసవి విద్యాసంస్థల అధినేత, గోళ్ళ సుబ్బరత్నం (బాబు) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు, డిస్టిక్ కో ఆర్డినేటర్, డాక్టర్,,పులి శ్రీనివాస ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈయన తండ్రి,గారు దివంగత, గోళ్ళ సాంబశివరావు, కంభం లయన్స్ క్లబ్ వ్యవస్థాపక దినం నుండి, తుది శ్వాస విడిచే వరకు, కంభం లయన్స్ క్లబ్ సభ్యునిగా కొనసాగారని తెలిపారు ,
వీరితో పాటుగా, వీరి పెద్ద కుమారుడు సుబ్బరత్నం కూడా, కంభం లయన్స్ క్లబ్ సభ్యునిగా సుదీర్ఘ కాలం నుండి కొనసాగుతూ వస్తున్నారని ఆయన తెలిపారు. వీరితోపాటు క్లబ్ ఉపాధ్యక్షునిగా నరాల ఈశ్వర రెడ్డి.కార్యదర్శిగా మొగల్ మహబూబ్ బేగ్.కోశాధికారిగా కందూరి వెంకట నాగేశ్వరరావు.సర్వీస్ ప్రోగ్రామ్స్ చైర్మన్ గా.సయ్యద్ జాకీర్ హుస్సేన్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు, సుబ్బరత్నం ను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
