ప్రమాదంలో గాయపడిన వారికి చేయూతనిచ్చిన ఎన్. టు. యం.వే.ఏ.ఫ్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండలం కంభం పట్టణంలోని బైక్ మెకానిక్ గా జీవనం సాగిస్తున్న రాము మరియు అశోక్ వీరి ద్దరికీ ఇటీవల కాలంలో ప్రమాదానికి గురి అయిన ఒకరికి ఎడమ మోకాలు కు గాయమైన మరొకరికి కుడి కాలు వేళ్ళు విరగగా ఈ ఇద్దరికీ డాక్టర్లు సుమారు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో గాయపడ్డ ఇద్దరికీ నవ్యాంధ్ర టూవీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి షేక్ సుభాని గారి ఆదేశాల మేరకు ఈ రోజు కంభం నవ్యాంధ్ర టూవీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ మరియు కంభం మండల అధ్యక్షుడు అయినటువంటి షేక్ రసూల్ చేతుల మీదుగా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది 5000 రూపాయలు నిత్యవసర సరుకులు మరియు ఒక్కొక్కరికి ఐదువేల రూపాయలు నగదు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కంభం నవ్యాంధ్ర టూవీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు రంగస్వామి మక్బూల్ అన్ను ఉమర్ నాగూర్ వలి వెంకట్ మరియు మెకానిక్ ముజీబ్ మరియు తదితర మెకానికులు పాల్గొన్నారు
