మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి: టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 30 : రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయానికి కృషి చేయాలని పలాస తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త వెంకన్న చౌదరి పిలుపునిచ్చారు.
పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్చార్జీలు, ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకన్న చౌదరి మాట్లాడుతూ, ప్రతి వార్డులో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించాలని సూచించారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ విజయమే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.
నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ముందుకు సాగితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సమావేశంలో ఎన్నికల నిర్వహణ, బూత్ స్థాయి కార్యాచరణ, ఓటర్లతో అనుసంధానం, పార్టీ సంస్థాగత బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. నాయకులు పలు సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సమావేశంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేష్, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్చార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

