తర్లకోట, కోసమాలలో వికసిత్ భారత్ జీ రామ్ జీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 2:
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని పలాస మండలం తర్లకోట గ్రామం, మందస మండలం కోసమాల గ్రామాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ జీ రామ్ జీ (VBGRAMG) కార్యక్రమాల్లో పలాస శాసన సభ్యులు శ్రీమతి గౌతు శిరీష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధికి పునాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి వసతులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామాల్లో ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


