లారీ డ్రైవర్ నిర్లక్ష్యం -వ్యక్తిపై దూసుకెళ్లిన లారీ - వ్యక్తి మృతి.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జూన్:21
మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 02.30 గంటల ప్రాంతంలో దొర్ల సురవరం గ్రామానికి చెందిన బసంత కుమార స్వామి ,42సం అను వ్యక్తి ఘాట్ రోడ్డు జంక్షన్ వద్ద నిలుచొని ఉండగా వడ్డాది నుండి పాడేరు వైపు వెళ్ళు బెంజ్ లారీని సదరు లారీ డ్రైవర్ అతివేంగంగా హార్న్ కొట్టకుండా నిర్లక్ష్యంగా నడిపి కుమార స్వామి ని గుద్ది అతని పైనుండి చక్రాలు వెళ్ళిపోవడం తో బలమైన గాయాలు అయ్యి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరిలించగా ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు . మృతుని తమ్ముడు అయిన బసంత ఘాటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని మాడుగుల ఎస్సై నారాయణరావు తెలిపారు

