ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.
రూ.11.78 లక్షల ఆర్థిక సాయం అందజేత.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 25: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష గురువారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న 9 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.11,78,624 విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. అవసరమైన సమయంలో ప్రజలు ప్రభుత్వ సహాయ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
లబ్ధిదారుల వివరాలు:
- పొందర రామలక్ష్మీ బెహరా – రూ.61,884
- కొల్లి కుమార్ – రూ.1,11,211
- తలగాపు వేణు – రూ.2,17,943
- బత్తిని రామారావు – రూ.96,491
- కొండ రాములు – రూ.63,734
- బొడ్డు విజయ్ కుమార్ – రూ.40,295
- బి.జి. జెస్సీ – రూ.67,735
- మల్ల నిర్మల – రూ.41,795
- గున్న దుర్గాప్రసాద్ (ఎల్వోసీ) – రూ.4,00,169
మొత్తం ఆర్థిక సాయం: రూ.11,78,624
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందడంతో లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గౌతు శిరీష గారికి కృతజ్ఞతలు తెలిపారు.

