స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశుద్ధ్య రథాల ప్రారంభం.



 స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశుద్ధ్య రథాల ప్రారంభం.

గ్రామాల పరిశుభ్రతకు ప్రజలందరూ సహకరించాలి: ఎమ్మెల్యే గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

మందస, జూన్ 25: 

స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవంతానికి గ్రామీణ పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మందస మండలంలో పారిశుద్ధ్య స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. పలాస నియోజకవర్గం మందస మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మూడు చక్రాల పారిశుద్ధ్య వాహనాలను పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలు మరింత మెరుగుపడనున్నాయని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాల నిర్వహణలో ఈ స్వచ్ఛ రథాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, గ్రామాలను ఆదర్శవంతమైన పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. “పరిశుభ్రమైన గ్రామం – ఆరోగ్యవంతమైన సమాజం” అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరికట్ల విట్టల్, మండల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్వచ్ఛత కార్మికులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post