జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జి.గోవిందరావు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి, జూన్ 01:
అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ (సీఐ) గా బాధ్యతలు స్వీకరించిన జి.గోవిందరావు సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సీఐ ఎస్పీకి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జిల్లాలో మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నూతన సీఐని ఆదేశించారు.
మహిళలపై జరిగే నేరాల పట్ల తక్షణమే స్పందించి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలి.
గృహ హింస, వేధింపుల కేసుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట బాధితులకు తగిన కౌన్సిలింగ్ అందించాలి.
పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళలు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకునేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి.
ప్రస్తుత కాలంలో మహిళలు, యువతులు సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొంటున్న సైబర్ వేధింపుల పట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, జిల్లాలో మహిళల రక్షణకై, శాంతిభద్రతల పరిరక్షణకై శాయశక్తులా కృషి చేస్తానని నూతన మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జి.గోవిందరావు ఈ సందర్భంగా ఎస్పీకి వినయపూర్వకంగా తెలియజేశారు.
.jpg)