సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం.




 సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం.

78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ ఫలాలు అణగారిన వర్గాలకు సంపూర్ణంగా దక్కలేదు -ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్.

ఏలూరు: ఏప్రిల్ 14 క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

75 సంవత్సరాలుగా భారతదేశ ప్రజలకు రక్షణగా ఉన్న రాజ్యాంగానికి నష్టం చేకూర్చే విధంగా నేటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పేర్కొన్నారు. 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం నాడు సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. అంబేద్కర్ చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ అధ్యక్షత వహించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక దేశ అభివృద్ధికి దేశంలో ఉన్న కులాలు జాతుల మధ్య ఐక్యతకు వాటి అభివృద్ధికి దోహదపడే విధంగా బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగం ను తయారుచేసి భారత ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని చైతన్య తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి దోహదపడే రాజ్యాంగాన్ని నేటి ఎన్డీఏ ప్రభుత్వం రద్దుచేసి, స్థానంలో మనువాద సిద్ధాంతానికి అనువైన రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ ఫలాలు అణగారిన వర్గాలకు సంపూర్ణంగా దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చైతన్య పేర్కొన్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను దేశ ప్రజలకు అనుగుణంగా అమలు చేయడం కోసం దేశ పౌరులు ముఖ్యంగా విద్యార్థులు, యువకులు బాధ్యత వహించాలని సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే సహాయ కార్యదర్శి పి కిషోర్ కోశాధికారి పుప్పాల కన్నబాబు, ఎఐటియుసి నాయకులు బుగతా జగన్నాథం,సిపిఐ కార్యకర్తలు యర్రా వెంకటేశ్వర్లు, బుగ్గల ప్రభాకర్, కనకం జగన్, ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు హార్దిక, నాగ, సాయి, ఆకాష్, పృద్వి, జయ కృష్ణ, నాని, మానస్, ప్రభుదేవ్, రాహుల్, మనోజ్ పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post