ఐ ఆర్ ప్రకటించాలి మరియు. పాత డి ఏ చెల్లించాలి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా, గిద్దలూరు. యుటిఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు పి ఆర్ సి కమిషన్ నియమించాలి,ఐ ఆర్ ప్రకటించాలి, పాతడిఏ బకాయిలు చెల్లించాలి ఆర్థిక బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలి, ఓ పి ఎస్ విధానాన్ని అమలుపరచాలి తదితర డిమాండ్స్ ను నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న రణభేరి 3.O కార్యక్రమం లో భాగంగా గిద్దలూరు నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు ఉపాద్యాయులు నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సహాద్యక్షులు ఐ.వి.రామిరెడ్డి,రాష్ట్ర కౌన్సిలర్ పి.రమణారెడ్డి, జిల్లా మహిళా కార్యదర్శి వి.మాధవి, జిల్లా ఆడిట్ మెంబర్ యస్.శ్రీనివాసులు, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు ,కంభం,అర్ధవీడు,బి.పేట మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు జి. రవీంద్ర నాథ్ రెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించడమైనది,
