బీజేపీ కంభం మండల ప్రశిక్షణ అభయాన్ లో బీజేపీ నాయకులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇంచార్జి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండలం జాతీయ రాష్ట్ర జిల్లా పార్టీ ల ఆదేశాల మేరకు కంభం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బాదం కిషోర్ ఆధ్వర్యంలో కంభం మండల బీజేపీ ఆఫీస్ లో జిల్లా అధ్యక్షులు శ్రీ సెగ్గం శ్రీనివాసరావు ముఖ్య అతిధులు గా మండల బీజేపీ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో విశిష్ట అతిధులు గా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె వి నారాయణాయ, గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్,, సీనియర్ నాయకులు బాదం మనోహర్ మరియు కలం సుబ్బారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి బూత్ కమిటీ ల నియామకం, పార్టీ చేరికలు, సభ్యత్వాలు, పూర్తి చేయడానికి ప్రతి బీజేపీ నాయకుడు కేంద్ర ప్రభుత్వ పధకాలు ప్రజలకు తెలియ చేయడానికి పనిచేయాలని, ప్రపంచం లో అతి పెద్ద పార్టీ బీజేపీ అని ఈ సందర్బంగా తెలియ చేయడం జరిగింది.