దేవస్థానానికి సీసీ కెమెరాలు బహూకరించిన బిజెపి నేత.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణం పి ఆర్ కాలనీలో ని దేవస్థాన కమిటీ సభ్యులు గా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి బిజెపి యువ నాయకుడు దప్పిలి వినోద్ రెడ్డి దాదాపు 30 వేల రూపాయల విలువచేసే సీసీ కెమెరాలు ఆలయానికి బహుకరించారు,
తన తండ్రి కీర్తిశేషులు దప్పిలి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి జ్ఞాపకార్థం కార్యక్రమం చేపట్టినట్లు వినోద్ రెడ్డి తెలిపారు.
ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన వినోద్ రెడ్డిని ఆలయ పెద్దలు బిజెపి ముఖ్యులు ఆయనను హృదయపూర్వకంగా అభినందించి సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ జెవి నారాయణ గిద్దలూరు పట్టణ బిజెపి అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ శంకర్ ఎస్సీ సెల్ మోర్చా సభ్యులు ఎం పుల్లయ్య మునగనూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు,
