ఒంగోల్ రిమ్స్ వైద్యశాలను అకస్మిక తనిఖీ నిర్వహించిన డిఆర్ఓ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి .బి.చిన ఓబులేసు శుక్రవారం ఒంగోలు రిమ్స్ వైద్యశాలను తనిఖీ చేశారు.
రోగులకు అందుతున్న సేవలు, వైద్యశాల లోని సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణను ఆయన పరిశీలించారు.
వైద్యశాలలోనే మందులు ఇస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని రోగులు ఆయనకు తెలిపారు, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు డి ఆర్ ఓ, బి,చిన ఓబులేసు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన వెంట డి ఎం హెచ్ ఓ,వెంకటేశ్వర్లు, సి.ఎస్. ఆర్.ఎమ్.ఓ. మాధవీ లత, ఇతర వైద్యులు ఉన్నారు.

