స్వచ్ఛ భారత్ దిశగా అడుగులు మార్కాపురంలో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసర యోబు.
మార్కాపురం జిల్లా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సాగుతున్న స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా, మార్కాపురం జిల్లా కేంద్రంలో భారీ అవగాహన మరియు పారిశుధ్య కార్యక్రమం నిర్వహించబడింది.
ఈకార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, రాజకీయ నాయకులు మరియు సామాజిక కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈకార్యక్రమానికి రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి ఏలూరు రామచంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వారితో పాటుఅప్పిశెట్టి ఉదయ్ శంకర్ గిద్దలూరు పట్టణ బిజెపి అధ్యక్షులు పి.వి. కృష్ణా రావు మార్కాపురం అసెంబ్లీ ఇంచార్జి డి.వి.ఎన్. నారాయణరావు (మార్కాపురం మున్సిపల్ కమీషనర్)
పెంచెల ప్రభాకర్ (ఆర్డీవో)మిద్దెల లక్ష్మి దేవి (సీనియర్ నాయకులు) మరియు మానవతా సేవా సభ్యులు పాల్గొన్నారు
స్వచ్ఛతే దేశాభివృద్ధికి పునాది
ఈ సందర్భంగా ఏలూరు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, అది ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.
