డా. బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవం జయప్రదం చేయండి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఏప్రిల్ 14 2026 తేదీన ప్రపంచ మేధావి. ఆధునిక భారత, పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించుటకు పీపుల్స్ యాక్షన్ ఫోరం ఇండియా ఉపాధ్యక్షులు కొత్తపల్లి,విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కరపత్రము ఆవిష్కరించారు,ఈ జయంతి ఉత్సవమునకు ముఖ్య అతిథులుగా జాతీయస్థాయి మేధావులను ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ప్రజలు ముఖ్యంగా యువత విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని, బహుజన రాజ్య స్థాపనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు చిట్లూరి ఏలియా లార్డ్స్ స్వచ్ఛంద సేవ సంస్థ, కత్తి అనోజి రీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ, దున్న యోబు స్పీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ, ఆదిమూలపు,అనిల్ రాజు లూకా, సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్,
నంది నాగయ్య స్పాన్ స్వచ్ఛంద సేవా సంస్థ, ఎన్, ప్రభుదాస్, విశ్రాంత టీచర్, డా. పూసలపాటి కేశవ్ పాల్ Phd,హదస్సా మినిస్ట్రీస్ స్థాపకులు కృపా శేఖర్, మరియు బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరియోబు,పీపుల్స్ యాక్షన్ ఫోరం ఇండియా నాయకులు బింగి బుజ్జి మార్కాపురం జిల్లా ఇన్చార్జి వినుకొండ ప్రభాకర్ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి జమ్మలమూడి అనిల్ కుమార్ కంభం మండల అధ్యక్షులు
యద్దనపూడి నవీన్ అర్ధవీడు మండల అధ్యక్షులు, చాట్ల,పవన్,యువజన నాయకులు,కుంపటి,భాస్కర్,పివిపురం అధ్యక్షులు కువ్వారపు రాజేష్ యువజన నాయకులు,చాట్ల, స్కైలాబ్ కిరణ్ చాట్ల,ఇమ్మానియేలు, ఎదురూరు, పెద్ద రమేష్తదితరులు పాల్గొన్నారు.
