బాలల రక్షణ - మహిళా భద్రతే లక్ష్యం:
కందులపురంలో ‘శక్తి యాప్’ మరియు ‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’పై అవగాహన తెలియజేసిన పోలీసులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో మహిళలు మరియు విద్యార్థినుల భద్రత కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
మార్కాపురం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని కందులపురం గ్రామంలో పోలీసులు పర్యటించి, స్థానిక మహిళలకు మరియు పాఠశాల విద్యార్థులకు భద్రతా అంశాలపై కీలక సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, ఆపదలో ఉన్నప్పుడు మహిళలను రక్షించే ‘శక్తి యాప్’ గురించి వివరించి, వారి మొబైల్ ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేయించారు.
అత్యవసర సమయంలో ఈ యాప్ పోలీసులకు ఎలా సమాచారం అందిస్తుందో ప్రత్యక్షంగా చూపారు.అదేవిధంగా, చిన్నపిల్లలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు విద్యార్థులకు ‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’ గురించి సులభంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించారు.
ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే భయపడకుండా తల్లిదండ్రులకు లేదా పోలీసులకు (డయల్ 100/112) సమాచారం అందించాలని ధైర్యం చెప్పారు.
మహిళల రక్షణే పోలీసుల ప్రథమ ప్రాధాన్యత అని, చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారానే నేరాలను అరికట్టవచ్చని పోలీస్ అధికారులు తెలిపారు.

